‘ప్రేమకు జై’ ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదల..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 10,2025: నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందే సినిమాలు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తాయి. అలాంటి చిత్రమే

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 10,2025: నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందే సినిమాలు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తాయి. అలాంటి చిత్రమే ‘ప్రేమకు జై’. గ్రామీణ నేపథ్యంలో యథార్థ ఘటనలతో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 11 (శుక్రవారం) థియేటర్లలో విడుదల కానుంది.
Read this also…‘Premaku Jai’ Brings a Fresh Love Story to Theatres on April 11…
ఇది కూడా చదవండి..అమెరికా వీసా పొందడానికి మీ వెన్నంటే గెహిస్ ఇమ్మిగ్రేషన్ & ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్
అనిల్ బురగాని, జ్వలిత జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ మల్లం దర్శకుడు, అనసూర్య నిర్మాత. ఈ ప్రత్యేకమైన ప్రేమకథ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా నిలిచింది. ఇదివరకు చూడని లవ్స్టోరీని అందిస్తామని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రచార చిత్రాలు ఇప్పటికే వైరల్గా మారాయి.

దర్శకుడు శ్రీనివాస్ మల్లం మాట్లాడుతూ, “ఒక పల్లెటూరిలో జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అనిల్ బురగాని, జ్వలిత తమ నటనతో ఆకట్టుకున్నారు. టీమ్ కృషి, నిర్మాత అనసూర్య సహకారంతో చిత్రం గొప్పగా తీరింది. నాణ్యతలో రాజీ లేదు. శుక్రవారం విడుదలయ్యే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అన్నారు.
Read this also…Gehis Immigration and International Legal Services Simplifies U.S. Visa Process for Artists and Entertainment Professionals
Read this also…Megastar Chiranjeevi and Smt. Surekha Rush to Singapore After Pawan Kalyan’s Son Mark Shankar Injured in Fire Accident
ఈ సినిమాలో అనిల్ బురగాని, ఆర్. జ్వలిత హీరో హీరోయిన్లుగా నటించగా, దుబ్బాక భాస్కర్ విలన్గా కనిపించనున్నారు. సాంకేతిక బృందంలో ఎడిటర్ సామ్రాట్, సినిమాటోగ్రాఫర్ ఉరుకుందా రెడ్డి, సంగీత దర్శకుడు చైతు ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎం. రాజేష్, సహ నిర్మాత మైలవరం రాజు, నిర్మాత అనసూర్య. కథ, దర్శకత్వం శ్రీనివాస్ మల్లం చేపట్టారు.