నర్సుల సేవలు అమూల్యం: ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మంగళగిరి, మే 12,2025: వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అమూల్యమని, ఫ్లోరెన్స్ నైటింగేల్‌ ఆదర్శంగా నిస్వార్థంగా సేవలందిస్తున్న

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మంగళగిరి, మే 12,2025: వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అమూల్యమని, ఫ్లోరెన్స్ నైటింగేల్‌ ఆదర్శంగా నిస్వార్థంగా సేవలందిస్తున్న నర్సులకు సమాజం కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ అన్నారు.

అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఎనిమిది మంది స్టాఫ్‌ నర్సులను ఆయన సన్మానించారు.

This is also read..“Amma” Short Film Reveals the Grandeur of Motherhood with a Heartfelt Message

ఇది కూడా చదవండి…‘అమ్మ’ చిత్రం ద్వారా అమ్మ గొప్పతనం గురించి హృదయాన్ని తాకే సందేశం..

ఈ సందర్భంగా నర్సులతో సమావేశమై వారి సేవలను కొనియాడారు. “కోవిడ్‌ సమయంలో మీరు చూపిన ధైర్యం, సేవాభావం మరచిపోలేం. రోగులకు మీరు అందించే సాంత్వన, శ్రమ అణగారిన గొంతుకలకు బలాన్ని ఇస్తుంది” అని తెలిపారు.

“సింగపూర్‌లో నా కుమారుడు ప్రమాదానికి గురైన సమయంలో అక్కడి నర్సుల సేవలు చూసినపుడు, మళ్లీ మీ సేవలు గుర్తొచ్చాయి. ఇది నాకు ఒక ఉద్వేగకరమైన అనుభవం” అని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి…జమ్మూ కాశ్మీర్‌లో పలు చోట్ల డ్రోన్ల తో పాక్ దాడులు, తిప్పికొట్టిన భారత సైన్యం..

నర్సులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరాధించారు. వీటిని త్వరలోనే ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ దృష్టికి తీసుకెళ్లేలా చూస్తామని హామీ ఇచ్చారు.

About Author