జాతీయ పాల దినోత్సవం – శ్వేత విప్లవం నుండి పోషక విప్లవం వరకు: భారతీయ పాల పరిశ్రమ పరిణామ క్రమ అన్వేషణ..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 26,2025: పాల కొరతతో సతమతమవుతున్న దేశం నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఎదిగిన భారత్… ఈ

రచన: శాంతను రాజ్, హెడ్ ఆఫ్ మార్కెటింగ్, గోద్రేజ్ జెర్సీ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 26,2025: పాల కొరతతో సతమతమవుతున్న దేశం నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఎదిగిన భారత్… ఈ అద్భుత పరివర్తనకు ఆధారం శ్వేత విప్లవం. ఆ విప్లవానికి శిల్పి, ‘భారత మిల్క్‌మ్యాన్’ డాక్టర్ వర్గీస్ కురియన్. ఆ మహానుభావుడి జన్మదినం సందర్భంగా ప్రతి నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. లక్షలాది రైతులకు ఆర్థిక స్వాతంత్ర్యం, గ్రామీణ భారతానికి సంపద సృష్టించిన ఆ యుగపురుషుడిని ఈ రోజు గౌరవపూర్వకంగా స్మరించుకుంటున్నాం.

ఈ దినోత్సవం గతాన్ని జ్ఞాపకం చేసుకోవడమే కాదు, ఎంత దూరం వచ్చామో, ఇంకా ఎంత ముందుకు సాగాలో ఆలోచించే సందర్భం కూడా. భారత పాడి రంగం ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెడుతోంది. పరిమాణం నుంచి నాణ్యత వైపు, ఉత్పత్తి నుంచి పోషకాహారం వైపు, సాంప్రదాయం నుంచి ఆవిష్కరణ వైపు పరుగులు పెడుతోంది. ఇదే ‘పోషక విప్లవం’ – ఆరోగ్యం, స్థిరత్వం, సాంకేతికతలపై ఆధారపడిన నూతన యుగం.

శ్వేత విప్లవం లక్ష్యం అందరి ఇంటా పాలు అందేలా చేయడం. కానీ ఈ రోజు ప్రశ్న మారింది – ఎంత పాలు ఉత్పత్తి అవుతున్నాయి అనేది కాదు, ఆ పాలు ఎంత మేలు చేస్తున్నాయి అనేది. భారతీయ వినియోగదారుడు మారిపోయాడు. ఇప్పుడు అతను లేబుల్ చదువుతాడు, ప్రోటీన్ శాతం చూస్తాడు, స్వచ్ఛత, మూలం, నైతిక సేకరణ గురించి ప్రశ్నిస్తాడు. పాలు ఇప్పుడు కేవలం ఆహారం కాదు – పూర్తి ఆరోగ్య ప్యాకేజీగా మారాయి.

పట్టణీకరణ, ఫిట్‌నెస్ అవగాహన పెరగడంతో రుచిగల పాలు, ప్రోబయోటిక్ పెరుగు, అధిక ప్రోటీన్ పానీయాలు, పనీర్, చీజ్‌లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రోటీన్ లోపం ఉన్న మన ఆహారంలో ఈ ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. యువతకు పాల ఉత్పత్తులంటే సంప్రదాయం మాత్రమే కాదు – రుచి, ఆరోగ్యం, సౌలభ్యం కలగలిసిన ఆధునిక ఎంపిక.

పొలం నుంచి ఫ్రిజ్ వరకు ప్రతి చుక్క పాలు ఇప్పుడు ట్రాక్ అవుతున్నాయి. ఐఓటీ, ఏఐ, డిజిటల్ ట్రేసబిలిటీ వంటి సాంకేతికతలు తాజాదనం, నాణ్యత, భద్రతను కాపాడుతున్నాయి. రైతులకు కూడా లాభం – డేటా ఆధారిత సలహాలతో పశువుల ఆరోగ్యం, దిగుబడి పెరుగుతున్నాయి. సాంకేతికత + సంప్రదాయ పద్ధతుల మేళవింపే భవిష్యత్‌ను తీర్చిదిద్దుతున్నాయి.

ప్రభుత్వం, పరిశ్రమ, విద్యాసంస్థలు ఒక్కటై పనిచేయాలి. నాణ్యతా ప్రమాణాలు, పర్యావరణ అనుకూల విధానాలు, రైతుల శిక్షణ, పరిశోధన – ఇవన్నీ కలిస్తేనే స్థిరమైన పాడి రంగం సాధ్యం.

భారత పాడి రంగం స్వయం సమృద్ధి కోసం ప్రారంభమైంది. ఇప్పుడది మెరుగైన ఆరోగ్యం, ఉన్నత నాణ్యత, స్థిరమైన వృద్ధి వైపు సాగుతోంది. తదుపరి విప్లవం లీటర్ల సంఖ్యతో కాదు – పోషక విలువ, మెరుగైన జీవితాలు, పర్యావరణ పరిరక్షణతో కొలవబడుతుంది.

About Author