పిఠాపురంలో అభివృద్ధి పనులకు శ్రీకారం – నాగబాబు పర్యటన
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పిఠాపురం,ఏప్రిల్ 3,2025:జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు ఈ నెల 4, 5 తేదీల్లో పిఠాపురం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పిఠాపురం,ఏప్రిల్ 3,2025:జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు ఈ నెల 4, 5 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఊతమిచ్చే పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతన నిర్మాణాలను ఆయన ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి...శ్రీవారికి రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, పిఠాపురం జనసేన ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్ పాల్గొననున్నారు. పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి...పెనుగొండ, మొగల్తూరులో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం