వర్షాకాలంలో దంతాల సంరక్షణ: డాక్టర్ సోనియా దత్తా సూచనలు..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,3 సెప్టెంబర్,2026: వర్షాకాలం అంటే వేడివేడి ఛాయ్, కరకరలాడే పకోడీల నుంచి కాల్చిన మొక్కజొన్న పొత్తులు, తీపి పదార్థాల వరకు ఇష్టమైన
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,3 సెప్టెంబర్,2026: వర్షాకాలం అంటే వేడివేడి ఛాయ్, కరకరలాడే పకోడీల నుంచి కాల్చిన మొక్కజొన్న పొత్తులు, తీపి పదార్థాల వరకు ఇష్టమైన ఆహారాలు ,తరచూ చిరుతిళ్లు తినడానికి పెట్టింది పేరు.
వర్షాకాలంలో ఇలాంటి రుచులు ఆస్వాదించడం సహజమైన అలవాటే అయినప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ సీజన్లో తరచూ తిండి తినే అలవాట్లు నోటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని దంత నిపుణులు హెచ్చరిస్తున్నారు.
*ప్రముఖ దంత వైద్య నిపుణురాలు డాక్టర్ సోనియా దత్తా* తెలిపిన వివరాల ప్రకారం, చక్కెర మరియు పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల దంతాలపై పాచి పేరుకుపోవడం, పిప్పి పళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
“వర్షాకాలం తరచుగా మన ఆహారపు అలవాట్లను మారుస్తుంది. వర్షపు వాతావరణంలో ఇష్టమైన రుచులను ఆస్వాదిస్తూ రోజంతా చాలామంది మాటిమాటికీ చిరుతిళ్లు తింటూ ఉంటారు. మనం ప్రతిసారి ఆహారం తీసుకున్నప్పుడు, ముఖ్యంగా చక్కె,పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తిన్నప్పుడు, నోటిలోని బ్యాక్టీరియా విడుదల చేసే ఆమ్లాలు దంతాల ఎనామెల్పై దాడి చేస్తాయి.
Read this also..Monsoon Snacking Can Takea Toll on Your Teeth; Maintaining Oral Hygiene is Essential: Dr. Sonia Datta..
Read this also..Netflix Rolls Out ‘Into the Southverse’ Hub to Spotlight Southern Indian Cinema..
చిరుతిళ్లు తినే అలవాటు పెరిగినప్పుడు, ఈ ఆమ్లాల దాడులు కూడా ఎక్కువవుతాయి. దీనివల్ల పంటి క్యావిటీలు,ఇతర నోటి సంబంధిత సమస్యల ముప్పు పెరుగుతుంది” అని ఆమె వివరించారు.
వర్షాకాల రుచులను పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదని, అయితే దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన నోటి పరిశుభ్రతను పాటించడం చాలా అవసరమని నిపుణులు స్పష్టం చేశారు.
“చిరుతిళ్లు తిన్న తర్వాత నోటిని నీటితో పుక్కిలించడం, శరీరానికి తగినంత నీరు తాగడం,రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవడం వంటి సాధారణ అలవాట్లు నోటి ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు మారే వర్షాకాలంలో ఈ జాగ్రత్తలను క్రమం తప్పకుండా పాటించడం చాలా ముఖ్యం” అని డాక్టర్ దత్తా పేర్కొన్నారు.
Read this also..HYBE INDIA RETURNS WITH HYBE INDIA AUDITION: FINAL CALL, EXPANDING ITS SEARCH ACROSS INDIA..
Read this also..Mahindra Auto clocks 59257 SUVs, a growth of 50% and 107648 total vehicle sales
దంత నిపుణులు రోజువారీ నోటి సంరక్షణలో నమ్మకమైన టూత్పేస్ట్ను భాగం చేసుకోవాలని మరింతగా సూచిస్తున్నారు. లవంగం, శొంఠి (అల్లం) వంటి విశ్వసనీయ ఆయుర్వేద మూలికలతో కూడిన డాబర్ రెడ్ టూత్పేస్ట్ సమగ్ర నోటి సంరక్షణను అందించడంలో సహాయపడుతుంది.
లవంగం క్రిములను ఎదుర్కొనే గుణాలకు పేరుగాంచడమే కాకుండా పంటి నొప్పి, అసౌకర్యాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. అలాగే శొంఠి చిగుళ్ల వాపును తగ్గించడంలో సహాయపడి చిగుళ్లను మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (IDA) గుర్తింపు పొందిన డాబర్ రెడ్ టూత్పేస్ట్, రోజువారీ దంత సంరక్షణలో భాగంగా దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వినియోగదారులకు సమర్థవంతమైన ఆయుర్వేద పరిష్కారాన్ని అందిస్తుంది.
కుటుంబ సభ్యులు వర్షాకాలపు చిన్నచిన్న సంతోషాలను ఆస్వాదిస్తున్న తరుణంలో, మితంగా చిరుతిళ్లు తినడం మరియు నిరంతరం నోటి పరిశుభ్రత పాటించడం అనే సమతుల్య విధానం వర్షాకాలపు కోరికలు దీర్ఘకాలిక దంత ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా చూస్తుందని దంత వైద్యులు సూచిస్తున్నారు.
“నోటి ఆరోగ్య సమస్యల గురించి ఆందోళన చెందకుండా వర్షాకాలపు సీజన్ను ఆనందంగా గడపాలి. సరైన దంత సంరక్షణతో పాటు కొన్ని మంచి అలవాట్లను పాటిస్తే, మీకిష్టమైన వర్షాకాలపు రుచులను ఆస్వాదిస్తూనే దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు” అని డాక్టర్ దత్తా వివరించారు.