పవన్ కళ్యాణ్కు మంత్రుల కృతజ్ఞతలు; రూ. 2123 కోట్ల రోడ్ల జీవో జారీ..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, డిసెంబర్ 12,2025: రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ప్రారంభానికి ముందే పలువురు మంత్రులు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, డిసెంబర్ 12,2025: రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ప్రారంభానికి ముందే పలువురు మంత్రులు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
తమ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో రోడ్ల నిర్మాణాల కోసం భారీగా నిధులు మంజూరు చేయడంపై వారు డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజల తరపున ధన్యవాదాలు: గత ప్రభుత్వ హయాంలో విధ్వంసమైన రోడ్ల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడా రోడ్లు బాగుపడతాయని, ముఖ్యమంత్రి తరపున, ప్రజల తరపున తాము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని మంత్రులు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు తెలిపారు.
కలిసిన మంత్రులు: ఈ మేరకు ఉప ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన వారిలో పయ్యావుల కేశవ్, శ్రీమతి వంగలపూడి అనిత, నారాయణ, నాదెండ్ల మనోహర్, శ్రీమతి సవిత, డి వి బి స్వామి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ ఉన్నారు.

‘పల్లె పండుగ 2.0’ పేరిట రోడ్ల పటిష్టత
రాష్ట్రంలో రోడ్ల పటిష్టత కోసం ఉద్దేశించిన ‘పల్లె పండుగ 2.0’ కార్యాచరణలో భాగంగా మొదటి విడత నిధులు మంజూరు చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ ఇప్పటికే జీవో జారీ చేసింది.
నిధులు విడుదల: మొత్తం రూ. 2123 కోట్ల మేర సాస్కీ (SASSKY) నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
లక్ష్యం: మొదటి విడతలో 26 జిల్లాల పరిధిలోని 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రోడ్ల పటిష్టతను చేపట్టాలని పంచాయతీ రాజ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
రోడ్ల పొడవు: సుమారు 4007 కిలో మీటర్ల మేర రోడ్లను పటిష్టపరిచేందుకు ఈ తొలి విడతలో కార్యాచరణ మొదలుపెట్టనున్నారు.
ఈ రహదారి నిర్మాణాలకు ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఇటీవలే శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నిధుల మంజూరుతో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రజల కష్టాలు తీరుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.