త్రైమాసిక, పూర్తి సంవత్సరంవారీగా అత్యధిక బుకింగ్స్ నమోదు చేసిన గోద్రెజ్ ప్రాపర్టీస్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబయి,ఏప్రిల్ 11,2025: ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్టీస్ (GPL) ఈ ఆర్థిక సంవత్సరం (FY25) చివరి త్రైమాసికం (Q4)లో

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబయి,ఏప్రిల్ 11,2025: ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్టీస్ (GPL) ఈ ఆర్థిక సంవత్సరం (FY25) చివరి త్రైమాసికం (Q4)లో బుకింగ్స్ విలువ తొలిసారి రూ.10,000 కోట్లను దాటి చరిత్ర సృష్టించింది. త్రైమాసికం గానూ, మొత్తం సంవత్సరానికి గానూ ఇదే అత్యధికంగా నమోదైన బుకింగ్స్ కావడం గమనార్హం.
Q4లో కంపెనీ రూ.10,163 కోట్ల విలువైన 3,703 యూనిట్లను విక్రయించింది. ఇది 7.52 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో జరిగింది. గత త్రైమాసికంతో పోలిస్తే (QoQ) ఇది 87 శాతం, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే (YoY) 7 శాతం పెరిగింది. వరుసగా ఏడో త్రైమాసికంగా రూ.5,000 కోట్లకు పైగా బుకింగ్స్ నమోదు చేయడం గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్రత్యేకతగా నిలిచింది.
Read this also…Godrej Properties Achieves Record-Breaking Quarterly and Annual Bookings
ఇది కూడా చదవండి..హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలకు చట్టపరమైన స్పష్టత కోసం ఉచిత ప్లాట్ఫారమ్ ప్రారంభం
మొత్తం FY25లో బుకింగ్స్ విలువ 31 శాతం పెరిగి రూ.29,444 కోట్లకు చేరింది. 25.73 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో 15,302 యూనిట్లను విక్రయించింది. ఇది దేశంలో ఏ ఇతర డెవలపర్ నమోదు చేయని రికార్డు కావడం విశేషం. వార్షిక గైడెన్స్తో పోలిస్తే జీపీఎల్ 109 శాతం మించి సాధించింది. FY25తో పాటు వరుసగా ఎనిమిదో ఆర్థిక సంవత్సరం కూడా కంపెనీ బుకింగ్స్ పెరిగాయి.

Q4లో నోయిడాలో గోద్రెజ్ రివరిన్ ప్రాజెక్ట్కు భారీ స్పందన లభించగా, ఒక్కదానితోనే రూ.2,000 కోట్ల బుకింగ్స్ నమోదయ్యాయి. గురుగ్రామ్లో గోద్రెజ్ ఆస్ట్రా రూ.1,000 కోట్లు, హైదరాబాద్లో గోద్రెజ్ మాడిసన్ ఎవెన్యూ కూడా రూ.1,000 కోట్ల బుకింగ్స్ నమోదు చేశాయి.
ముఖ్య నగరాలైన ఎన్సీఆర్, ఎంఎంఆర్, బెంగళూరులో వరుసగా రూ.10,500 కోట్లు, రూ.8,000 కోట్లు, రూ.5,000 కోట్లకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి.
Read this also…Dolby Laboratories to Bring Dolby Cinema to India, Delivering a Premium Cinema Experience for Moviegoers
Read this also…Vantara Unveils New Website Featuring a Future-Ready, Immersive Digital Experience in Wildlife Rescue and Conservation
“తొలిసారి త్రైమాసిక బుకింగ్స్ రూ.10,000 కోట్లు దాటడం గర్వంగా ఉంది. గత మూడేళ్లుగా వార్షికంగా 55% వృద్ధి రేటును కొనసాగించగలగడం మా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లింది. రెండో సంవత్సరం కూడా అత్యధిక బుకింగ్స్తో దేశంలో అగ్రగామిగా నిలిచాం. FY25లోనే రూ.26,450 కోట్ల ఫ్యూచర్ బుకింగ్స్తో మా ఆర్డర్ బుక్ బలంగా ఉంది. గత ఏడాది క్యూఐపీ ద్వారా సమీకరించిన రూ.6,000 కోట్ల ఈక్విటీ క్యాపిటల్, ఈ ఏడాది ఆర్జించిన ఆపరేటింగ్ క్యాష్ఫ్లో కలిసి భవిష్యత్తు వృద్ధికి పునాది వేస్తాయి,” అని గోద్రెజ్ ప్రాపర్టీస్ ఎండీ & సీఈవో గౌరవ్ పాండే పేర్కొన్నారు.