“ప్రతి అమ్మాయి హెచ్పీవీ టీకా తీసుకోవడం అత్యవసరం: గ్రేస్ క్యాన్సర్ ఫౌండర్”
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 28, 2025: క్యాన్సర్ పై విజయం సాధించేందుకు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ , మ్యాక్సిమస్ ఇండియా సంయుక్తంగా ఒక

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 28, 2025: క్యాన్సర్ పై విజయం సాధించేందుకు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ , మ్యాక్సిమస్ ఇండియా సంయుక్తంగా ఒక ఉత్సాహవంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా కర్నాటక రాష్ట్రం, దేవనగిరి లోని మయూర్ గ్లోబల్ స్కూల్ లో ఉచిత హెచ్పీవీ టీకాలు ,క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో మొత్తం 350 మంది బాలికలకు హెచ్పీవీ టీకాలు ఇవ్వడం జరిగినట్లు సమాచారం. అలాగే, 200 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. హెచ్పీవీ టీకా ద్వారా గర్భాశయ కాన్సర్ సహా హెచ్పీవీ సంబంధిత క్యాన్సర్లను గణనీయంగా తగ్గించవచ్చు.
ఇది కూడా చదవండి…మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో ఎక్మో (ECMO) సేవలు: ప్రాణరక్షణలో ఆధునిక పరిష్కారం..
ఈ టీకా నిర్దిష్ట హెచ్పీవీ వైరస్ రకాల నుంచి రక్షణ కల్పిస్తుంది, తద్వారా భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో క్యాన్సర్ కేసులు నివారించవచ్చు.

గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ స్థాపకుడు డా. చినబాబు సుంకవల్లి అన్నారు: “ప్రతి అమ్మాయి బాల్యంలోనే హెచ్పీవీ టీకా తీసుకోవాల్సిందే. మనం అందరం కలిసి ఈ రక్షణ కవచాన్ని అందిద్దాం,” అని పేర్కొన్నారు.
మ్యాక్సిమస్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ప్రవీణ భీమవరపు జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యం వున్నాయో వివరించారు. “ఆరంభంలోనే జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ను గణనీయంగా తగ్గించవచ్చు,” అని ఆమె తెలిపారు.
ఇది కూడా చదవండి…HCL Foundation ప్రకటించిన 2025 HCLTech గ్రాంట్: విప్లవాత్మక NGOలకు రూ.16.5 కోట్లు సహాయం..
కర్నాటక ప్రభుత్వ అధికారి శ్రీ పి.ఎన్. లోకేశ్ ఆరోగ్య కార్యక్రమాల్లో ప్రజల సహకారం కీలకమని చెప్పారు.
ఈ కార్యక్రమం క్యాన్సర్ లేని భారత్ దిశగా తీసుకున్న ఒక ప్రాధాన్యమైన అడుగు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ,మ్యాక్సిమస్ ఇండియా భాగస్వామ్యం భవిష్యత్ ఆరోగ్య కార్యక్రమాలకు ఆదర్శంగా నిలుస్తుందని వక్తలు పేర్కొన్నారు.