పల్లెల అభివృద్ధే లక్ష్యం: పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘మాట-మంతి’..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్ ,డిసెంబర్ 10,2025:రాష్ట్రంలోని పల్లెలను దేశానికి వెన్నెముకగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్,

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్ ,డిసెంబర్ 10,2025:రాష్ట్రంలోని పల్లెలను దేశానికి వెన్నెముకగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి సీకే కన్వెన్షన్ లో ఉద్యోగులతో ‘మాట-మంతి’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన మూడు విభాగాల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ విస్తృత సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, అధికారులు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రధాన సమస్యలైన తాగునీరు, సాగునీరు, రోడ్లు, మురుగు కాలువలు, ఉపాధి హామీ, పాఠశాల విద్య, నిరుద్యోగం వంటి అంశాలపై కీలక చర్చలు జరిపారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యాంశాలు:
ఉద్యోగులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో సంస్కరణలు, అధికారుల సహకారం, ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత కనిపించింది:

‘పల్లెలు నిజంగా దేశానికి వెన్నెముక లాంటివి.’ అందుకే తాను పంచాయతీ రాజ్ శాఖను తీసుకున్నానని స్పష్టం చేశారు.

అధికారుల సహకారం: “ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ లాంటి అధికారుల అనుభవంతోనే ఈ శాఖలో ఇన్ని రిఫామ్స్ తీసుకురాగలిగాం. పంచాయతీ రాజ్ శాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా అధికారుల అనుభవం, సూచనలతోనే తప్ప నా సొంత నిర్ణయాలు లేవు,” అని తెలిపారు.

సంస్కరణల దిశగా: శాఖలో ఉన్న ఉద్యోగుల సమస్యలు తన దృష్టికి వచ్చినప్పుడు, అనేక సమీక్షల అనంతరం పలు సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించుకున్నామని, ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

పదోన్నతులలో కృషి: ఈ శాఖలో ఔట్‌సోర్సింగ్‌తో కలిపి దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, వీరిలో పదివేల మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే విషయంలో అధికారులు ఎంతో కష్టపడ్డారని కొనియాడారు.

కొత్త మార్పులు: సంస్కరణల్లో భాగంగా, పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ డవలప్‌మెంట్ ఆఫీసర్ (PDO) గా మార్చామని తెలిపారు.

కొత్త కార్యాలయాలు: రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయి సిబ్బందితో 77 డి.డి.ఓ. (DDO) కార్యాలయాలను ప్రారంభించినట్లు ప్రకటించారు.

ఉద్యోగుల భద్రత: “ఉద్యోగుల భద్రత, హక్కుల పరిరక్షణ బాధ్యతను భుజాల పైకి ఎత్తుకున్నాము. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం,” అని హామీ ఇచ్చారు.

పారదర్శకత: కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలాంటి సిఫార్సులు లేకుండా ఈ పనులన్నీ చేయగలుగుతున్నామని, అంతర్గత బదిలీలను తొలిసారిగా చాలా పారదర్శకంగా నిర్వహించామని వెల్లడించారు.

శిక్షణలో అగ్రస్థానం: కెపాసిటీ బిల్డింగ్‌లో ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి ఏపీని దేశంలోనే మొదటి స్థానంలోకి తీసుకొచ్చామని తెలిపారు.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉపశమనం: ఈ శాఖలో ఉన్న 600 మందికి పైగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల బకాయిలను వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

చివరగా, నేటి సమావేశంలో ఉద్యోగులు ఇచ్చిన సూచనలన్నీ పరిగణలోకి తీసుకున్నామని, ఉద్యోగులు కూడా పౌరుల పట్ల హుందాగా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి కోరారు.

About Author