ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ కూలిన ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 8,2025: కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఓవర్‌హెడ్‌ ట్యాంకు కూలిన ఘటనపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా స్పందించారు.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 8,2025: కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఓవర్‌హెడ్‌ ట్యాంకు కూలిన ఘటనపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా స్పందించారు. వెంటనే ఆర్‌డబ్ల్యూఎస్‌ (గ్రామీణ నీటి సరఫరా) శాఖ అధికారులను సంప్రదించి పూర్తి వివరాలను తీసుకున్నారు.

ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ… ‘‘ఘటన జరిగిన సమయంలో పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇదే తరహా ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ట్యాంకు నిర్మాణ నాణ్యతపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి నివేదికను వెంటనే పంపించాలి.

ఇందులో నిర్లక్ష్యం పాలించిన వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలి’’ అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నాణ్యతను సమీక్షించేందుకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల నుంచి సమగ్ర నివేదిక తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

About Author