అడ్వాన్స్డ్ సిస్-టెక్ ఐపీవో: సెబీకి ముసాయిదా పత్రాల దాఖలు
వారాహి మీడియా డాట్ కామ్,ఫిబ్రవరి 11,2025: అడ్వాన్స్డ్ సిస్-టెక్ లిమిటెడ్ (Advanced Sys-Tek Ltd) తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం ముసాయిదా ప్రాస్పెక్టస్ (DRHP)ను మార్కెట్
వారాహి మీడియా డాట్ కామ్,ఫిబ్రవరి 11,2025: అడ్వాన్స్డ్ సిస్-టెక్ లిమిటెడ్ (Advanced Sys-Tek Ltd) తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం ముసాయిదా ప్రాస్పెక్టస్ (DRHP)ను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది.
ఈ ఐపీవోలో రూ. 115 కోట్ల విలువైన తాజా షేర్ల జారీతో పాటు, ప్రస్తుత ప్రమోటర్ల ద్వారా 15.27 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలో విక్రయించనున్నారు.
ప్రమోటర్లయిన ముకేష్ ఆర్. కపాడియా (Mukesh R Kapadia) ,ఉమెద్ అమర్చంద్ ఫిఫాద్రా (Umed Amarchand Fifadra) చెరించగా 7.64 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ప్రస్తుతానికి, ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు కంపెనీలో 82.57% వాటాను కలిగి ఉన్నాయి.

ఈ ఐపీవో ద్వారా సమీకరించే నిధులను పెట్టుబడి వ్యయాలు, దీర్ఘకాలిక నిర్వహణ మూలధనం, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు. అడ్వాన్స్డ్ సిస్-టెక్ ప్రధానంగా ఇండస్ట్రియల్ ఆటోమేషన్ పరిష్కారాలు అందించడంలో నిపుణత కలిగి ఉంది.
చమురు, వాయువు టెర్మినల్స్ కోసం ఆధునిక ఆటోమేటెడ్ మీటరింగ్ వ్యవస్థలు ,హస్తచాలిత సదుపాయాల నవీకరణ సేవలను అందిస్తోంది.
2024 సెప్టెంబర్ 30 నాటికి, కంపెనీ దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా 200కి పైగా ప్రాజెక్టులు విజయవంతంగా అమలు చేసింది.
ఈ ఐష్యూకి ఇంగా వెంచర్స్ (Inga Ventures), సొవిలో క్యాపిటల్ అడ్వైజర్స్ (Sowilo Capital Advisors) బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.