ఉద్యోగ విరామం తర్వాత మహిళలకు కొత్త అవకాశాలు – క్వాలిజీల్ ప్రత్యేక కార్యక్రమం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మార్చి 27, 2025: మహిళా నిపుణులకు కెరీర్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ప్రముఖ క్వాలిటీ ఇంజనీరింగ్ సంస్థ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మార్చి 27, 2025: మహిళా నిపుణులకు కెరీర్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ప్రముఖ క్వాలిటీ ఇంజనీరింగ్ సంస్థ క్వాలిజీల్ ముందుకు వచ్చింది. ఉద్యోగ విరామం తర్వాత తిరిగి ప్రొఫెషనల్ రంగంలో అడుగుపెట్టాలనుకునే మహిళల కోసం ‘రిస్టార్ట్ విత్ క్వాలిజీల్’ (క్వాలిజీల్తో పునఃప్రారంభం) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఇది కూడా చదవండి..పిఠాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
Read this also…Wishing Ram Charan Greater Heights of Success:Pawan Kalyan
మహిళల ప్రతిభను గుర్తించే వినూత్న ప్రయత్నం
నైపుణ్యం, అనుభవం ఏపాటిదైనా.. కొంతకాలం విరామం తర్వాత తిరిగి ఉద్యోగాల్లోకి రావడంలో సవాళ్ల సహజమే. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని, క్వాలిజీల్ సౌకర్యవంతమైన పని వాతావరణంతోపాటు, ప్రతిభను పదిలపరచేలా శిక్షణ, మార్గనిర్దేశం, అదనపు నైపుణ్యాభివృద్ధికి అవకాశాలు కల్పిస్తోంది.

DEI లక్ష్యాలను విస్తరిస్తున్న క్వాలిజీల్
ప్రస్తుతం 43% మంది మహిళా ఉద్యోగులతో కొనసాగుతున్న క్వాలిజీల్, డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ (DEI) లక్ష్యాలను మరింత విస్తరిస్తోంది. లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడంపై దృష్టిసారిస్తోంది.
ఇది కూడా చదవండి..రామ్ చరణ్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
ఈ సందర్భంగా క్వాలిజీల్ సహ వ్యవస్థాపకుడు & ఇండియా ఆపరేషన్స్ హెడ్ మధు మూర్తి మాట్లాడుతూ – “వైవిధ్యానికి విలువనిచ్చే వాతావరణంలోనే అసలైన ఆవిష్కరణలు ఎదుగుతాయి. టెక్ ఇండస్ట్రీలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. క్వాలిజీల్తో పునఃప్రారంభం అనేది ఉద్యోగ అవకాశాలకంటే ఎక్కువ… మహిళల నైపుణ్యాన్ని, అభ్యాసాన్ని, కొత్త దృక్పథాన్ని టెక్ పరిశ్రమలో మరింత ముందుకు తీసుకురావడం మా లక్ష్యం” అని పేర్కొన్నారు.