బీసీల పోరాటంలో స్పష్టత.. రాజకీయ పార్టీల్లో ఉంటుందా చిత్తశుద్ధి..?
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మంగళగిరి, ఏప్రిల్ 10,2026: సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలు.. రాజ్యాధికారంలో మాత్రం నేటికీ అణచివేతకు గురవుతూనే ఉన్నారు. ఎన్నికల
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మంగళగిరి, ఏప్రిల్ 10,2026: సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలు.. రాజ్యాధికారంలో మాత్రం నేటికీ అణచివేతకు గురవుతూనే ఉన్నారు. ఎన్నికల వేళ బీసీలను తమ ‘సంప్రదాయ ఓటు బ్యాంకు’గా అభివర్ణించే రాజకీయ పార్టీలు, అధికారం దక్కాక మాత్రం వారిని విస్మరిస్తున్నాయన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
ఇతర వర్గాలకు ఇచ్చే ప్రాధాన్యం బీసీలకు దక్కకపోవడం వెనుక అంతులేని రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. గతంలో బీసీల ఉద్ధరణ పేరుతో కొందరు నేతలు పదవులు దక్కించుకున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో సామాన్యుడి బతుకు మారలేదన్న అసంతృప్తి ఆ వర్గాల్లో గూడుకట్టుకుంది.

కులగణన ఏది? వాటా ఎక్కడ?
రాష్ట్రంలో బీసీల జనాభా లెక్కలు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అధికారికంగా తేల్చకపోవడం అతిపెద్ద లోపంగా మారింది. వాస్తవ లెక్కలు తేలితేనే విద్య, ఉద్యోగ, చట్టసభల్లో దక్కాల్సిన వాటాపై స్పష్టత వస్తుంది.
ఈ అన్యాయానికి చెక్ పెట్టేందుకు ‘భారత చైతన్య యువజన పార్టీ’ అధినేత బోడె రామచంద్ర యాదవ్ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. బీసీల హక్కుల సాధనే లక్ష్యంగా ఏప్రిల్ 11 (శనివారం) నుంచి మంగళగిరి వేదికగా ఆయన ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.
ఇదీ చదవండి :భద్రత, అవగాహన కోసం టాల్ రేడియో ఎస్ సి ఎస్ సి (SCSC) కీలక భాగస్వామ్యం..
Read this also..Instagram Content Trends 2026: The Formats and Styles Winning Right Now
ప్రభుత్వం ముందున్న ఐదు ప్రధాన డిమాండ్లు:
కేవలం నిరసనలతో సరిపెట్టకుండా, బీసీల అభ్యున్నతికి అవసరమైన ఐదు కీలక అంశాలను ఆయన ప్రభుత్వం ముందుంచారు.
బీసీ రక్షణ చట్టం: బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని వెంటనే అమలు చేయాలి.
ఇదీ చదవండి :భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో MG విండ్సర్ ప్రభంజనం..
Read this also:MG Windsor Emerges as India’s Top-Selling Electric Vehicle in 2025..
రాజధానిలో వాటా: అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీ వర్గాలకు 1000 ఎకరాల భూమిని కేటాయించాలి.

సమగ్ర కులగణన: రాష్ట్రవ్యాప్తంగా శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టి గణాంకాలను వెల్లడించాలి.
రిజర్వేషన్ల పెంపు: విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
నిధుల విడుదల: నామమాత్రంగా మారిన బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు మంజూరు చేయాలి.
రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు..
బీసీల ఐక్యతే పరమావధిగా బోడె రామచంద్ర యాదవ్ చేస్తున్న పోరాటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇన్నాళ్లూ తమను ఓటు యంత్రాలుగా చూసిన పార్టీలపై ఒత్తిడి పెంచడంలో ఆయన సఫలీకృతమయ్యారు.
బీసీ సామాజిక వర్గాల్లో వస్తున్న చైతన్యం, ఆయన దీక్షకు లభిస్తున్న మద్దతు చూస్తుంటే.. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో బీసీల పాత్ర నిర్ణయాత్మకంగా మారనుందని స్పష్టమవుతోంది.
బీసీ బిడ్డలంతా ఏకమైతేనే భావితరాలకు సమాన హక్కులు దక్కుతాయన్న నినాదంతో ఆయన చేపడుతున్న ఈ పోరాటం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.