లైట్స్, కెమెరా, సింగపూర్! క్లూక్తో కలిసి నగరం యొక్క విభిన్న కోణాన్ని ఆవిష్కరించిన ఫరాఖాన్..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, మే 2,2026: క్లూక్ ఇండియా, తమ కొత్త వేసవి ప్రయాణ ప్రచారం కోసం ప్రఖ్యాత చిత్ర దర్శక నిర్మాత ఫరాఖాన్తో భాగస్వామ్యం చేసుకున్నట్లు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, మే 2,2026: క్లూక్ ఇండియా, తమ కొత్త వేసవి ప్రయాణ ప్రచారం కోసం ప్రఖ్యాత చిత్ర దర్శక నిర్మాత ఫరాఖాన్తో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా భారతీయ యాత్రికులను, సరికొత్త, ఊహించని అనుభవాల ద్వారా సుపరిచితమైన గమ్యస్థానాలను తిరిగి కనుగొనమని ఆహ్వానిస్తోంది.
దీనికోసం క్లూక్ ఇప్పుడు ఫరాఖాన్తో ప్రచార చిత్రం రూపొందించింది. ఆమెతో పాటుగా ఆమె వ్యక్తిగత చెఫ్, దిలీప్ కూడా దీనిలో కనిపిస్తారు. ఈ ప్రచారంతో, తమకు తెలిసిన వాటికి మించి చూడమని, ప్రణాళికాబద్ధమైన, ఆకస్మికమైన, విశిష్టమైన, స్థానిక, ఊహించిన,ఊహించని అనుభవాలకు చోటు కల్పించమని క్లూక్ యాత్రికులను ప్రోత్సహిస్తుంది.
డిజిటల్లో తొలుత క్లూక్ ఇండియా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అందుబాటులో ఉంది. త్వరలోనే మూడు చిన్న ఎపిసోడ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి, పూర్తి బ్రాండ్ ఫిల్మ్ మే నెల ప్రారంభంలో క్లూక్ ఇండియా ఇన్స్టాగ్రామ్,యూట్యూబ్ హ్యాండిల్స్లో విడుదల చేయబడుతుంది.
Read this also..EuroSchool Achieves 100% Pass Rate in ICSE & ISC 2026 Board Examinations
Read this also..‘Prem Ki Leela’ From Krishnavataram Out: A Soulful Anthem Celebrating the Many Shades of Divine Love..
“నేటి భారతీయ యాత్రికులు గతంలో కంటే ఎక్కువ సమాచారాన్ని తెలుసుకుంటూ, మరింత స్ఫూర్తిని పొందుతున్నారు. అయినప్పటికీ, చాలా సెలవు ప్రయాణాలు ఆశ్చర్యకరంగా ఒకేలా ముగుస్తాయి. టాప్-టెన్ జాబితా ఎక్కడ ముగుస్తుందో, అక్కడే అత్యంత సంతృప్తినిచ్చే ప్రయాణాలు మొదలవుతాయని మేము నమ్ముతాము” అని క్లూక్ ఇండియా & మిడిల్ ఈస్ట్ మార్కెటింగ్ లీడ్ శివమ్ త్యాగీ అన్నారు.
భారతీయ యాత్రికుడు ముందుకు సాగిపోయాడు. మరి మీ విహార యాత్ర కూడానా… ?
క్లూక్ యొక్క తాజా ట్రావెల్ పల్స్ స్టడీ ప్రకారం, భారతీయ యాత్రికులు తమ సెలవులను గడిపే విధానం మారుతోందని వెల్లడైంది. యాత్రికులు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాతే కొత్త కార్యకలాపాలను కనుగొనడానికి, ప్రయాణంలోనే అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి, అక్కడికి చేరుకున్న తర్వాత స్థానిక సిఫార్సులను కోరడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

దాదాపు ప్రతి ఐదుగురు భారతీయ యాత్రికులలో ఇద్దరు, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలతో పాటు అంతగా ప్రాచుర్యం లేని ప్రత్యామ్నాయాలను కూడా అన్వేషిస్తున్నారు, ఈ విషయంలో జెన్ జి ముందుంది. దాదాపు ప్రతి ఇద్దరు మిలీనియల్ యాత్రికులులో ఒకరు, స్థానిక సంస్కృతితో నిజంగా మమేకం కావడానికి తక్కువ ప్రదేశాలలో ఎక్కువ కాలం గడపడానికి ఇష్టపడతామని చెబుతున్నారు.
ప్రణాళికాబద్ధమైన ముఖ్యాంశాలు, అప్పటికప్పుడు చేసే బుకింగ్లు, ఆవిష్కరణలతో, యాత్రికులు ఆ ప్రశ్నకు సమాధానం కనుగొనడంలో సహాయపడటానికి క్లూక్ రూపొందించబడింది.
వేసవి ప్రచారం ఇప్పుడు ప్రారంభం కావడంతో, క్లూక్ ఇండియా యాత్రికులను, తమకు తెలుసని వారు భావించే గమ్యస్థానాలను మరోసారి పరిశీలించి, అక్కడ తెలుసుకోవటానికి ఇంకా ఎంత ఉందో కనుగొనమని ఆహ్వానిస్తోంది.