తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 1,2025: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 1,2025: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా, శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అర్చకులు వేదమంత్రోచ్ఛరణల మధ్య అభిషేకం చేస్తారు.

సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ కూడా జరుగనుంది. అనంతరం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు బంగారువాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానం వేడుకగా నిర్వహించనున్నారు.

అదేవిధంగా, ఏప్రిల్ 7న శ్రీ రామ పట్టాభిషేకం పర్వదినాన్ని పురస్కరించుకుని, రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య బంగారువాకిలి వద్ద ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు.

About Author